Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక
17-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో,సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని,వారికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో,సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని,వారికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News