బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి కీలక నేతల చేరిక
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి కీలక నేతల చేరిక
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
భువనగిరి మండల పరిధిలోని బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో,సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని,వారికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి