బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం
Sthanikam District Staff Reporter
భువనగిరి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా వార్డు గులాబీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ.. గడప గడపకు తిరుగుతూ...ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ... ముస్తాల హేమలత ఆనంద్ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రతి సమస్యపై స్పందించి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి మీరు దీవించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకె వేసి వార్డు కౌన్సిలర్ గా గెలిపించగలరని వార్డు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,పార్టీ సీనియర్ కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి