Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:17 AM

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం
16-02-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ల ఘన నివాళి

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కు ఘనంగా సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, ఎస్టీ రిజర్వేషన్ ద్వారా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన బుడ్డా సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వలన తాము కౌన్సిలర్లుగా ఎన్నికకావడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ లేనిదే మనకు జీవనం లేదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను మదిలో నిలుపుకుని దేవుడిలా భావించి, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు బోయ దేవేందర్, మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు బక్క శ్రీనాథ్, సుక్క సుదర్శన్, మాదాని గోపాల్, మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహ, దొనకొండ కిరణ్, గణేష్, బద్రి గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

Article Image

అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ల ఘన నివాళి

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కు ఘనంగా సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, ఎస్టీ రిజర్వేషన్ ద్వారా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన బుడ్డా సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వలన తాము కౌన్సిలర్లుగా ఎన్నికకావడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ లేనిదే మనకు జీవనం లేదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను మదిలో నిలుపుకుని దేవుడిలా భావించి, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు బోయ దేవేందర్, మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు బక్క శ్రీనాథ్, సుక్క సుదర్శన్, మాదాని గోపాల్, మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహ, దొనకొండ కిరణ్, గణేష్, బద్రి గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News