Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:51 PM

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం
February 16, 2026 08:28 PM 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ల ఘన నివాళి

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కు ఘనంగా సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, ఎస్టీ రిజర్వేషన్ ద్వారా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన బుడ్డా సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వలన తాము కౌన్సిలర్లుగా ఎన్నికకావడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ లేనిదే మనకు జీవనం లేదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను మదిలో నిలుపుకుని దేవుడిలా భావించి, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు బోయ దేవేందర్, మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు బక్క శ్రీనాథ్, సుక్క సుదర్శన్, మాదాని గోపాల్, మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహ, దొనకొండ కిరణ్, గణేష్, బద్రి గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News