Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన
28-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 'వందేమాతరం సామూహిక గీతాలాపన'కార్యక్రమం అత్యంత అట్టహాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్,మంత్రిపెగడ శ్రీధర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన తారక మంత్రం ‘వందేమాతర గీతం'అని కొనియాడారు. ఆనాటి దేశభక్తులు వందేమాతరం మంత్రాన్ని ఆయుధంగా ధరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఆ స్ఫూర్తితో నేటి విద్యార్థులు,యువకులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భావిభారత పౌరులైన విద్యార్థులే ఎదిగి పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని, మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి ప్రోగ్రామ్స్ కన్వీనర్ బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని వివిధ కళాశాలల,పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు బాదం ప్రకాశ్, పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు పసునూరి నాగభూషణం,మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్,తొగిడి భాస్కర్, బెల్ద గణేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమ నిర్వహణలో జాగిలాపురం నాగరాజు,సుదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ,మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, బేతి కన్నయ్య ఎం.కె.శ్రీధర్,మెరుగు మధు,ఆడెపు పాండు,సుర్వి మణికంఠ,బెల్లంకొండ చంద్రకాంత్, పంచద్దుల భరత్,బొడ్డు సాయి కిరణ్,విరాట్,పి.సంతోష్ మరియు వివిధ పాఠశాల,కళాశాలల యాజమాన్యాలు క్రియాశీలకంగా వ్యవహరించారు.

Sthanikam

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 'వందేమాతరం సామూహిక గీతాలాపన'కార్యక్రమం అత్యంత అట్టహాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్,మంత్రిపెగడ శ్రీధర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన తారక మంత్రం ‘వందేమాతర గీతం'అని కొనియాడారు. ఆనాటి దేశభక్తులు వందేమాతరం మంత్రాన్ని ఆయుధంగా ధరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఆ స్ఫూర్తితో నేటి విద్యార్థులు,యువకులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భావిభారత పౌరులైన విద్యార్థులే ఎదిగి పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని, మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి ప్రోగ్రామ్స్ కన్వీనర్ బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని వివిధ కళాశాలల,పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు బాదం ప్రకాశ్, పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు పసునూరి నాగభూషణం,మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్,తొగిడి భాస్కర్, బెల్ద గణేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమ నిర్వహణలో జాగిలాపురం నాగరాజు,సుదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ,మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, బేతి కన్నయ్య ఎం.కె.శ్రీధర్,మెరుగు మధు,ఆడెపు పాండు,సుర్వి మణికంఠ,బెల్లంకొండ చంద్రకాంత్, పంచద్దుల భరత్,బొడ్డు సాయి కిరణ్,విరాట్,పి.సంతోష్ మరియు వివిధ పాఠశాల,కళాశాలల యాజమాన్యాలు క్రియాశీలకంగా వ్యవహరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News