Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:42 AM

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన
January 28, 2026 05:26 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 'వందేమాతరం సామూహిక గీతాలాపన'కార్యక్రమం అత్యంత అట్టహాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్,మంత్రిపెగడ శ్రీధర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన తారక మంత్రం ‘వందేమాతర గీతం'అని కొనియాడారు. ఆనాటి దేశభక్తులు వందేమాతరం మంత్రాన్ని ఆయుధంగా ధరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఆ స్ఫూర్తితో నేటి విద్యార్థులు,యువకులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భావిభారత పౌరులైన విద్యార్థులే ఎదిగి పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని, మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి ప్రోగ్రామ్స్ కన్వీనర్ బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని వివిధ కళాశాలల,పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు బాదం ప్రకాశ్, పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు పసునూరి నాగభూషణం,మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్,తొగిడి భాస్కర్, బెల్ద గణేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమ నిర్వహణలో జాగిలాపురం నాగరాజు,సుదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ,మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, బేతి కన్నయ్య ఎం.కె.శ్రీధర్,మెరుగు మధు,ఆడెపు పాండు,సుర్వి మణికంఠ,బెల్లంకొండ చంద్రకాంత్, పంచద్దుల భరత్,బొడ్డు సాయి కిరణ్,విరాట్,పి.సంతోష్ మరియు వివిధ పాఠశాల,కళాశాలల యాజమాన్యాలు క్రియాశీలకంగా వ్యవహరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News