Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:52 AM

భువనగిరిలో పోలింగ్ సామగ్రి పరిశీలన సన్నద్ధతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

భువనగిరిలో పోలింగ్ సామగ్రి పరిశీలన సన్నద్ధతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

భువనగిరిలో పోలింగ్ సామగ్రి పరిశీలన సన్నద్ధతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
09-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచిన పోలింగ్ సామగ్రిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సమర్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న బ్యాలెట్ బాక్సులు, సీలింగ్ విధానం, సీల్ వేయడం–తీయడం ప్రక్రియ, వివిధ ఫారాలు, స్టేషనరీతో పాటు ఇతర ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామగ్రి సమయానికి చేరేలా కచ్చితమైన ప్రణాళికతో పంపిణీ చేయాలని సూచించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని భాస్కర్ రావు అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రతి దశలో జాగ్రత్త అవసరమని హెచ్చరించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎన్నికల విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో పోలింగ్ సామగ్రి పరిశీలన సన్నద్ధతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచిన పోలింగ్ సామగ్రిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సమర్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న బ్యాలెట్ బాక్సులు, సీలింగ్ విధానం, సీల్ వేయడం–తీయడం ప్రక్రియ, వివిధ ఫారాలు, స్టేషనరీతో పాటు ఇతర ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామగ్రి సమయానికి చేరేలా కచ్చితమైన ప్రణాళికతో పంపిణీ చేయాలని సూచించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని భాస్కర్ రావు అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రతి దశలో జాగ్రత్త అవసరమని హెచ్చరించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎన్నికల విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News