Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ
21-05-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందించాలని సూచన

భువనగిరి,: భువనగిరి డివిజన్ డీఎస్పీ బి. రవీందర్ గురువారం భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.

స్టేషన్‌లోని రికార్డులు, ఫైల్స్‌ను ‘5ఎస్ విధానం’ ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

సందర్శనలో భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో ఎం. అనిల్‌కుమార్, ఎస్‌ఐపీ కె. శివశంకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

Article Image

ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందించాలని సూచన

భువనగిరి,: భువనగిరి డివిజన్ డీఎస్పీ బి. రవీందర్ గురువారం భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.

స్టేషన్‌లోని రికార్డులు, ఫైల్స్‌ను ‘5ఎస్ విధానం’ ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

సందర్శనలో భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో ఎం. అనిల్‌కుమార్, ఎస్‌ఐపీ కె. శివశంకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News