భువనగిరి పోలీస్స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ
భువనగిరి పోలీస్స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ
Editor Desk
ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందించాలని సూచన
భువనగిరి,: భువనగిరి డివిజన్ డీఎస్పీ బి. రవీందర్ గురువారం భువనగిరి పోలీస్స్టేషన్ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
స్టేషన్లోని రికార్డులు, ఫైల్స్ను ‘5ఎస్ విధానం’ ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
సందర్శనలో భువనగిరి రూరల్ ఎస్హెచ్వో ఎం. అనిల్కుమార్, ఎస్ఐపీ కె. శివశంకర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి