Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
February 17, 2026 01:47 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

35వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా,

29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్,వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కూడా పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా కొత్త పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News