భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
Sthanikam District Staff Reporter
35వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా,
29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్,వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కూడా పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా కొత్త పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి