Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం
04-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter


ప్రతి గడపను కదిలించి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం గారి అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అభ్యర్థులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అభ్యర్థి తమ తమ వార్డుల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. ప్రతి గడపను కదిలిస్తూ బలమైన ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో కనీసం 50 మంది కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ, భువనగిరి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలా కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తే చైర్మన్‌గా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, నర్సింగ్ రావు, సుర్వి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, చందుపట్ల వెంకటేష్, యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఇండ్ల సత్యలక్ష్మి, తిరుమలేష్, ఆకుతోట రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం

Article Image


ప్రతి గడపను కదిలించి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం గారి అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అభ్యర్థులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అభ్యర్థి తమ తమ వార్డుల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. ప్రతి గడపను కదిలిస్తూ బలమైన ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో కనీసం 50 మంది కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ, భువనగిరి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలా కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తే చైర్మన్‌గా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, నర్సింగ్ రావు, సుర్వి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, చందుపట్ల వెంకటేష్, యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఇండ్ల సత్యలక్ష్మి, తిరుమలేష్, ఆకుతోట రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News