ప్రతి గడపను కదిలించి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం గారి అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అభ్యర్థులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అభ్యర్థి తమ తమ వార్డుల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. ప్రతి గడపను కదిలిస్తూ బలమైన ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో కనీసం 50 మంది కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ, భువనగిరి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలా కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తే చైర్మన్గా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, నర్సింగ్ రావు, సుర్వి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, చందుపట్ల వెంకటేష్, యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఇండ్ల సత్యలక్ష్మి, తిరుమలేష్, ఆకుతోట రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి