భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలోని శబరి నగర్ లో ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం మరియు వేద ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కార్యక్రమంలో సభ్యులు మంచాల ఋషికేష్,చీకటిమల్ల రాములు,పోకుల సోమన్న,సుగ్గుల చంద్రశేఖర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భువనగిరి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి