Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు
January 29, 2026 12:06 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సీపీఎంకు 6వ వార్డు కేటాయింపు - 35 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా

బ్యూరో:శ్రీనివాస్

భువనగిరి టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్, సీపీఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భువనగిరి మున్సిపాలిటీలో సీపీఎం పార్టీకి 6వ వార్డును కేటాయించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ, మొత్తం 35 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. 6వ వార్డు సీపీఎం పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు కొలుపుల వివేక్‌ను బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్ తుమ్మల పాండు బలపరిచారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యతో పాటు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News