Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు
January 29, 2026 12:06 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సీపీఎంకు 6వ వార్డు కేటాయింపు - 35 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా

బ్యూరో:శ్రీనివాస్

భువనగిరి టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్, సీపీఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భువనగిరి మున్సిపాలిటీలో సీపీఎం పార్టీకి 6వ వార్డును కేటాయించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ, మొత్తం 35 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. 6వ వార్డు సీపీఎం పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు కొలుపుల వివేక్‌ను బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్ తుమ్మల పాండు బలపరిచారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యతో పాటు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News