Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల విజయం చరిత్రాత్మకం

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల విజయం చరిత్రాత్మకం

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల విజయం చరిత్రాత్మకం
February 18, 2026 07:38 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల సత్తా - సామాజిక న్యాయానికి బలమైన సందేశం

బీసీ చైతన్యానికి గెలుపు గర్జనగా మున్సిపల్ కౌన్సిలర్లు

జనరల్ మహిళా చైర్మన్, వైస్ చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం

రాజకీయ సాధికారత వైపు బీసీ మహిళలు ముందడుగు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు గెలుపు పతాకం ఎగురవేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీసీ సంఘాల ఉద్యమ స్ఫూర్తితో అధిక సంఖ్యలో కౌన్సిలర్లుగా విజయం సాధించడం బీసీల సామూహిక చైతన్యానికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి మాట్లాడుతూ,రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు కౌన్సిలర్లుగా గెలవడం సాధారణ విషయం కాదన్నారు.బీసీల శక్తిని అధిష్టానం గుర్తించి రాష్ట్రంలో అధిక సంఖ్యలో చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించడం శుభపరిణామమని,ఇది సామాజిక న్యాయానికి బలమైన సందేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బీసీల రాజకీయ సాధికారతకు ఇది నాంది అని,భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం కల్పించాలని నాయకులు కోరారు.రాబోయే ఎంపీటీసీ,జెడ్పిటిసి స్థానాలలో బీసీలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేసి,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్ పదవులను కూడా కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గొట్టిపాముల బాబు రావు,నియోజకవర్గ అధ్యక్షుడు సాబన్ కార్ వెంకటేష్,భువనగిరి మండల అధ్యక్షుడు చిన్న మల్లేష్,శివకుమార్,పుమార్ విక్రమ్,కిషన్,చెన్నోజుల నరేంద్ర చారి,వడ్లకొండ ఉపేంద్ర చారి,బలరాం,బ్రహ్మచారి ప్రతాప్ చారి,శ్రీధరాచారి,చక్రపాణి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News