PRINT TIME: February 23, 2026 10:06 PM
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్
February 18, 2026 07:39 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
హైదరాబాద్లోని వారి నివాసంలో బుధవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిలను భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు,ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి విషయాలపై సమగ్రంగా మాట్లాడారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్పర్సన్,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి