జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్పై తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడి చేశారు.
దాడి సందర్భంగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మందుల విలువ దాదాపు రూ.45 వేలుగా అధికారులు తెలిపారు.
అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను విక్రయించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి