PRINT TIME: February 24, 2026 10:16 PM
భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన
భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన
February 24, 2026 08:58 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా, రొద్దం మండలం: భూచెర్ల గ్రామం నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామానికి నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను రొద్దం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు.
2024 సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో, పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సవితమ్మ
భూచెర్ల మరియు నాగిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు తారు రోడ్డు అవసరమని తెలియజేశారు. ఆమె స్పందిస్తూ, ఎన్నికల అనంతరం రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలను తీర్చుతానని హామీ ఇచ్చారు.
ఎన్నికల అనంతరం, సవితమ్మ ఆర్@బీ అధికారులతో సమీక్ష జరుపుతూ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు, మండల టీడీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులలో రోడ్డు పూర్తి చేసి, గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి