Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 08:26 AM

భూ పంపిణీ నిషేధం ఎత్తివేయాలి సాగు చేసుకుంటున్న పేదలకు పాసుబుక్కులు ఇవ్వాలి: బొల్లు యాదగిరి

భూ పంపిణీ నిషేధం ఎత్తివేయాలి సాగు చేసుకుంటున్న పేదలకు పాసుబుక్కులు ఇవ్వాలి: బొల్లు యాదగిరి

భూ పంపిణీ నిషేధం ఎత్తివేయాలి సాగు చేసుకుంటున్న పేదలకు పాసుబుక్కులు ఇవ్వాలి: బొల్లు యాదగిరి
May 13, 2026 06:31 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేసి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మంగళవారం భువనగిరిలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఐదు మండలాల్లో భూ పంపిణీ నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు భూమిలేని పేదలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.12 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.

ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు కీలకమైన ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను గ్రామీణ కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 15న ఉపాధి హామీ రక్షణ కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం 15 మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా నోముల జ్యోతి, కార్యదర్శిగా పల్లెర్ల అంజయ్య, ఉపాధ్యక్షులుగా కొండపురం యాదగిరి, మాణిక్యం, సహాయ కార్యదర్శులుగా కూకుట్ల చొక్కాకుమారి, నరాల చంద్రయ్య, బొల్లెపల్లి కిషన్‌లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, బోడ ఆంజనేయులు, రవి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News