భూక్య కౌసల్య గెలుపు కోసం గాంధీనగర్ ప్రజలు
భూక్య కౌసల్య గెలుపు కోసం గాంధీనగర్ ప్రజలు
Biksham
ఇంటింటి ప్రచారంలో వెల్లువెత్తిన జన సందోహం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
13వ వార్డు గాంధీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జన సందోహం భారీగా తరలివచ్చి భూక్య కౌసల్య గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచీ కార్యకర్తల మాదిరిగా ప్రజలు ముందుకు వచ్చి ప్రచారం చేశారు. వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య కౌసల్యకు మద్దతు తెలుపుతూ ప్రజలు నినాదాలు చేశారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేస్తూ ఈ ఎన్నికల్లో భూక్య కౌసల్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన తమపై మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని, గెలుపు సాధించిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి