Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు
12-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా,సాంకేతికతను దుర్వినియోగం చేసి తక్కువ మొత్తాన్ని జమ చేసిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసిన ఇటువంటి అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు భువనగిరి మరియు చౌటుప్పల్ ఆర్డీవోలను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయడమే కాకుండా,సంబంధిత అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు అవకాశం లేదని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు

Article Image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా,సాంకేతికతను దుర్వినియోగం చేసి తక్కువ మొత్తాన్ని జమ చేసిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసిన ఇటువంటి అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు భువనగిరి మరియు చౌటుప్పల్ ఆర్డీవోలను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయడమే కాకుండా,సంబంధిత అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు అవకాశం లేదని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News