భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు
భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు
Sthanikam District Staff Reporter
జిల్లా కలెక్టర్ హనుమంతరావు
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా,సాంకేతికతను దుర్వినియోగం చేసి తక్కువ మొత్తాన్ని జమ చేసిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసిన ఇటువంటి అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు భువనగిరి మరియు చౌటుప్పల్ ఆర్డీవోలను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయడమే కాకుండా,సంబంధిత అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు అవకాశం లేదని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి