Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:58 AM

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
January 14, 2026 05:49 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.

విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News