భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.
విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.
ఈ టోర్నమెంట్లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.
ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి