Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:39 AM

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
January 14, 2026 05:49 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.

విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News