భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
నకిరేకల్ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
భోగభాగ్యాలు అందించే భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆట విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి, భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఈ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భోగి మంటలతో పాతదాన్ని విడిచిపెట్టి, కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు.
ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి