Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:51 PM

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
14-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


భోగభాగ్యాలు అందించే భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆట విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి, భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఈ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భోగి మంటలతో పాతదాన్ని విడిచిపెట్టి, కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు.

ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


భోగభాగ్యాలు అందించే భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆట విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి, భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఈ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భోగి మంటలతో పాతదాన్ని విడిచిపెట్టి, కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు.

ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News