భూభారతిలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు
భూభారతిలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
బీబీ నగర్ మండలలో తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి,భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు,సిబ్బందితో సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను,సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని,అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా,పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని,భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి