Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:49 PM

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్
April 10, 2026 05:00 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ, ఏప్రిల్ 10: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన పురవీధుల్లో విద్యార్థులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందని ఆయన విమర్శించారు.

వేల కోట్ల బకాయిలను నిలిపివేయడం వల్ల విద్యార్థులు అప్పుల బారిన పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి చర్యలు కొనసాగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News