Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్
10-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ, ఏప్రిల్ 10: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన పురవీధుల్లో విద్యార్థులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందని ఆయన విమర్శించారు.

వేల కోట్ల బకాయిలను నిలిపివేయడం వల్ల విద్యార్థులు అప్పుల బారిన పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి చర్యలు కొనసాగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

Article Image

నల్లగొండ, ఏప్రిల్ 10: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన పురవీధుల్లో విద్యార్థులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందని ఆయన విమర్శించారు.

వేల కోట్ల బకాయిలను నిలిపివేయడం వల్ల విద్యార్థులు అప్పుల బారిన పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి చర్యలు కొనసాగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News