Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే
January 19, 2026 03:12 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


మెగా డిజిటల్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రస్తుతం కొనసాగుతున్న మొబైల్ యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాచార రంగంలో ప్రజలకు అత్యంత తక్కువ సమయంలో అత్యధిక మందికి చేరువయ్యే డిజిటల్ మీడియానే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారని, భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. హుజూర్నగర్‌కు చెందిన జర్నలిస్టు చిలక సైదులు ఆధ్వర్యంలో రూపొందించిన మెగా డిజిటల్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా సమాచార వ్యవస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎప్పటికప్పుడు తమను తాము నవీకరించుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాచారం అందించే విధంగా వార్తలు రూపొందించాలని తెలిపారు. సమాజం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇంకా పాత పద్ధతులకే పరిమితమవ్వకుండా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మీడియా రంగంలోకి నూతనంగా వచ్చే వారిని అనుభవజ్ఞులు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపొందించిన జర్నలిస్టు చిలక సైదులును అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్, సూర్యాపేట నియోజకవర్గ అసోసియేషన్ నాయకులు వంశీకృష్ణ శర్మ, కొండ రవి, కుంచం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News