భవానీనగర్లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు
భవానీనగర్లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు
Editor Desk
.భవానీనగర్లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి (స్థానిక ప్రతినిధి):
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్లో లక్ష్మీరాజు స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమం భవానీనగర్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, వైనాల ప్రవీణ్, సిరిగిరి రాజు, పిట్టల శ్రీనివాస్, ఫరీద్, వినోద్ యాదవ్, సంపత్ గౌడ్, సయ్యద్ మబ్బు, సంతోష్ రాందాస్ ముదిరాజ్, సయ్యద్ యూసుఫ్ బాయ్, ఎస్.ఆర్. ప్రసాద్, బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షిస్తూ భక్తులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమం సజావుగా సాగి, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి