భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం
స్థానికం ప్రతినిధి
భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.
నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి