భ్రూణ హత్యలు చేయడమంటే....అది మానవత్వంపై దాడి చేయడమే...
భ్రూణ హత్యలు చేయడమంటే....అది మానవత్వంపై దాడి చేయడమే...
Sthanikam District Staff Reporter
ఆడపిల్ల పుట్టుకను ఆపడం అంటే..... రేపటి ఊపిరిని ఆపేయడమే...
గ్రామస్థాయి నుండే లింగ వివక్షతకు అడుగులు పడాలి
ఆడబిడ్డను కాపాడుకుందాం...లింగ వివక్షను రూపు మాపుదాం
లింగ సమానత్వ కన్వర్టెన్సీ సమావేశంలో......
డిఎంహెచ్ ఓ మనోహర్ రావు,
శిశు సంక్షేమ అధికారి నరసింహారావు
అమ్మ కావాలి... భార్య కావాలి... చెల్లి కావాలి...కానీ కూతురు మాత్రమే వద్దు...ప్రాణం పోసే శక్తిని ప్రాణం తీసే హక్కుగా మార్చుకోవడం చట్ట రిత్యా నేరమని,ఇది ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలని,భ్రూణ హత్యలు నివారణ గ్రామ స్థాయి నుండి పునాది పడాలని
డిఎంహెచ్ ఓ మనోహర్రావు, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహారావులు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం షార్ప్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రమీల అధ్యక్షతన స్థానిక హౌసింగ్ బోర్డ్ లోని డిస్కో మినీ ఫంక్షన్ హాల్ లో కన్వర్టెన్సీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు,జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్,టౌన్ ఎస్ఐ ఓ సంధ్య, డిపిఓ రేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...లింగ సమానత్వం అనే అంశాన్ని అధికారులు ఏరకంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి కమిటీలు దీని రూపుమాపాలని అనే ముందు మార్పు అనేది కమిటీల కాగితాల్లోనే కాదు...ప్రతి ఇంటి గడప నుండి మొదలవ్వాలని ఆడపిల్ల పుట్టుకను ఆపడం అంటే రేపటి ప్రపంచానికి ఊపిరి ఆపడేమని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు తమ ఇంటిలో మగ పిల్లవాడికి ఇచ్చే ప్రాధాన్యతను ఆడపిల్ల కు సమానంగా ఉండే విధంగా గుర్తించాలని కోరారు. లింగ వివక్షను వీడి ఆడబిడ్డ పుట్టడం హాక్కుగా స్వీకరించినప్పుడే సమాజం లోని మానవ విలువలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.ఉచిత కాల్ సెంటర్ 15 100 సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు గుర్తించిన తెలిసిన మీ వంతు బాధ్యతగా ప్రభుత్వ సంస్థలకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ ఆశ స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు.సామాజికంగా ఎదురయ్యే సమస్యల కోసం మన వంతు బాధ్యతగా లింగ సమానత్వం సాధన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.గృహ హింస, నిరోధక చట్టం అవగాహన కమిటీలు ప్రేమ్ కమిటీలు బలోపేతం చేయాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.సఖి అడ్మిన్ సఖి సర్వీసెస్ సేవలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ అధికారి సాయి శ్రీనివాస్,ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి సుదర్శన్,మెడికల్ ఆఫీసర్ నిరోషా,ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం కవిత,కౌన్సిలర్ శోభ,జి.రాజేష్, సరిత,వరలక్ష్మి,ప్రోగ్రాం,మేనేజర్ శ్రీనివాసరావు,మహిళా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి