Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ 649 వ జయంతి వేడుకలు.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ 649 వ జయంతి వేడుకలు.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ 649 వ జయంతి వేడుకలు.
January 31, 2026 07:34 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలం లో బీజేపీ ఆధ్వర్యంలో సంత్ గురు రవి దాస్ జయంతి వేడుకలు సందర్భంగా ఏలూరు జిల్లా బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ

సంత్ గురు రవిదాస్ 14వ శతాబ్దానికి చెందిన దళిత సామాజిక వర్గంలో చేబిలి కులానికి చెందిన వారని, జనవరి 31 నుండి ఫిబ్రవరి 7 వరకు సంత్ రవి దాస్ జయంతి వేడుకలు రాష్ట్రంలోని ప్రతి దళితవాడలో జరిపించి దళితుల యొక్క మూలాలను చరిత్రను ఈ తరం వారి కి తెలియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని,సంత్ గురు రవి దాసు వృత్తి పరంగా చెప్పులు కుట్టేవారని, ఆయన ఒక సజీవ చైతన్యం సమిష్టి సంకల్పం మరియు అన్యాయానికి తలవంచకూడదని మానవాళిని ఏకం చేయాలని మనకు నేర్పే భారతదేశం నాగరిక కథ యొక్క చిహ్నమని, కుల వివక్ష మరియు అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన తన జీవితాన్ని మొత్తం అంకితం చేశారని, ఆయన పోరాటం ,త్యాగం ,నేటికీ మనకి స్పూర్గాతి దాయకంగానే ఉన్నాయని, రవి దాస్ రచనలు కవిత్వాలు విధివిధానాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలపై ఘాడమైన ప్రభావం చూపాయని, ముఖ్యంగా కుల వ్యవస్థ వ్యతిరేకతలో అతని మానవత్వం ,సందేశాలు, దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని, దళితుల హక్కులు అవసరాలు కోసం పోరాడే ఆలోచన శక్తి రవి దాస్, కబీర్, బుద్ధుని యొక్క భక్తి విధానాలు అంబేద్కర్ వరకు కుల వ్యతిరేక, దార్శనిక గొలుసు ఏర్పడిందని, అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని రాయటానికి స్ఫూర్తినిచ్చిందని నమ్ముతూ భారతీయ జనతా పార్టీ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ దళిత జాతి రత్నాలను ఈ తరం వారికి పరిచయం చేస్తూ, వారు మరచిపోయే వ్యక్తులు కాదు ముందు తరాలు గుర్తుంచు కోవాల్సిన కోవాల్సిన ఒక ప్రతిష్టమైన దైవ శక్తి లాంటివాళ్ళు అని గుర్తు చేస్తూ దళితుల అభివృద్ధికి, గౌరవానికి పూర్తి న్యాయం చేయదలచారని, గౌతమ బుద్ధుడు, గురు రవి దాస్ మరియు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి దళితుడు తమ హక్కులకై పోరాడుతూ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారని అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News