భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ 649 వ జయంతి వేడుకలు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ 649 వ జయంతి వేడుకలు.
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి మండలం లో బీజేపీ ఆధ్వర్యంలో సంత్ గురు రవి దాస్ జయంతి వేడుకలు సందర్భంగా ఏలూరు జిల్లా బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ
సంత్ గురు రవిదాస్ 14వ శతాబ్దానికి చెందిన దళిత సామాజిక వర్గంలో చేబిలి కులానికి చెందిన వారని, జనవరి 31 నుండి ఫిబ్రవరి 7 వరకు సంత్ రవి దాస్ జయంతి వేడుకలు రాష్ట్రంలోని ప్రతి దళితవాడలో జరిపించి దళితుల యొక్క మూలాలను చరిత్రను ఈ తరం వారి కి తెలియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని,సంత్ గురు రవి దాసు వృత్తి పరంగా చెప్పులు కుట్టేవారని, ఆయన ఒక సజీవ చైతన్యం సమిష్టి సంకల్పం మరియు అన్యాయానికి తలవంచకూడదని మానవాళిని ఏకం చేయాలని మనకు నేర్పే భారతదేశం నాగరిక కథ యొక్క చిహ్నమని, కుల వివక్ష మరియు అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన తన జీవితాన్ని మొత్తం అంకితం చేశారని, ఆయన పోరాటం ,త్యాగం ,నేటికీ మనకి స్పూర్గాతి దాయకంగానే ఉన్నాయని, రవి దాస్ రచనలు కవిత్వాలు విధివిధానాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలపై ఘాడమైన ప్రభావం చూపాయని, ముఖ్యంగా కుల వ్యవస్థ వ్యతిరేకతలో అతని మానవత్వం ,సందేశాలు, దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని, దళితుల హక్కులు అవసరాలు కోసం పోరాడే ఆలోచన శక్తి రవి దాస్, కబీర్, బుద్ధుని యొక్క భక్తి విధానాలు అంబేద్కర్ వరకు కుల వ్యతిరేక, దార్శనిక గొలుసు ఏర్పడిందని, అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని రాయటానికి స్ఫూర్తినిచ్చిందని నమ్ముతూ భారతీయ జనతా పార్టీ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ దళిత జాతి రత్నాలను ఈ తరం వారికి పరిచయం చేస్తూ, వారు మరచిపోయే వ్యక్తులు కాదు ముందు తరాలు గుర్తుంచు కోవాల్సిన కోవాల్సిన ఒక ప్రతిష్టమైన దైవ శక్తి లాంటివాళ్ళు అని గుర్తు చేస్తూ దళితుల అభివృద్ధికి, గౌరవానికి పూర్తి న్యాయం చేయదలచారని, గౌతమ బుద్ధుడు, గురు రవి దాస్ మరియు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి దళితుడు తమ హక్కులకై పోరాడుతూ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారని అన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి