Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:38 PM

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి
March 09, 2026 06:05 PM 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతికి మెమోరాండం పంపించే కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య మంత్రి చేసిన ప్రకటనలు చూస్తే అమెరికాకు భారత పాలకులు తలవంచినట్లుగా ఉందని విమర్శించారు. భారతీయ ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికాలో సుంకాలు పెంచడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.

అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు ఎత్తివేయడం వల్ల దేశీయ రైతులు పోటీకి తట్టుకోలేక పండించిన పంటలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. దీంతో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తి చేసే రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడతారని పేర్కొన్నారు.

అమెరికా నుండి ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు రుణ విమోచన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కలపాల జ్యోతి, ఆడుమల్లి వెంకటేశ్వరరావు, చిట్టిపాటి పుల్లారావు, కొత్తపల్లి సోమేశ్వరరావు, కొత్తపల్లి ప్రసాద్, రాము, కలపాల సోమయ్య, ఆడుమిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News