భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి
భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి
Biksham
శివరాత్రి జనజాగరణలో సాంస్కృతిక కార్యక్రమాలు
దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, బచ్చలకూరి శ్రీనివాస్
సూర్యాపేట భక్తులందరిపై శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్ , 12వ వార్డు పురపాలక మాజీ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఉన్న పిల్లలమర్రి ఎరకేశ్వరాలయంలో నిర్వహించిన జనజాగరణ కార్యక్రమాలను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలందరూ పాడిపంటలతో సుఖసంతోషాలతో జీవించాలని, శివుని ఆశీస్సులు ప్రతి ఇంటిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.పిల్లలమర్రి దేవాలయాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుక ఆనంద్, చెరుకుపల్లి బుచ్చి రాములు, చిత్తలూరి పూజిత, ఓ బల్లోజు తేజస్విని, వల్లాల జానీ, షేక్ జానీ మియా , రాయల సైదులు, చెరుకుపల్లి కృష్ణ , లంజపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి