Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి
February 16, 2026 08:30 AM 356 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శివరాత్రి జనజాగరణలో సాంస్కృతిక కార్యక్రమాలు

దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, బచ్చలకూరి శ్రీనివాస్

సూర్యాపేట భక్తులందరిపై శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్ , 12వ వార్డు పురపాలక మాజీ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఉన్న పిల్లలమర్రి ఎరకేశ్వరాలయంలో నిర్వహించిన జనజాగరణ కార్యక్రమాలను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలందరూ పాడిపంటలతో సుఖసంతోషాలతో జీవించాలని, శివుని ఆశీస్సులు ప్రతి ఇంటిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.పిల్లలమర్రి దేవాలయాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుక ఆనంద్, చెరుకుపల్లి బుచ్చి రాములు, చిత్తలూరి పూజిత, ఓ బల్లోజు తేజస్విని, వల్లాల జానీ, షేక్ జానీ మియా , రాయల సైదులు, చెరుకుపల్లి కృష్ణ , లంజపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News