Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

భక్తుల రద్దీకి ముందస్తు జాగ్రత్తలు – బారికేడ్లు ఏర్పాటు చేయనున్న దాతలు

భక్తుల రద్దీకి ముందస్తు జాగ్రత్తలు – బారికేడ్లు ఏర్పాటు చేయనున్న దాతలు

భక్తుల రద్దీకి ముందస్తు జాగ్రత్తలు – బారికేడ్లు ఏర్పాటు చేయనున్న దాతలు
March 24, 2026 07:49 PM 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో,మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే 7 వారాల మహా జాతరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు.భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలయ నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్ చందానగర్‌కు చెందిన నత్తు & సన్స్ జువెల్లరి సంస్థ ప్రముఖ బంగారం వ్యాపారులు రాజు రిజ్వానీ, రాజేష్ రిజ్వాని, సూరజ్ రిజ్వాని గారు స్పందించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో భారీ బారికేడ్లు (బారిగేట్లు) ఏర్పాటు చేయించడంతో పాటు అవసరమైన బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.వారి సహకారానికి కృతజ్ఞతగా ఈ రోజు ఆలయ సిబ్బంది శేఖర్ వారికి శాలువ కప్పి సత్కరించారు.అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వాదం పొందేలా చేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యం కోసం ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భక్తులు సురక్షితంగా,సౌకర్యంగా జాతరలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News