Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం
23-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ఘనంగా 95వ వర్ధంతి – ఏఐవైఎఫ్ నేతల నివాళులు

భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన త్యాగస్ఫూర్తిని చాటిన విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడని కొనియాడారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం భగత్ సింగ్‌దని తెలిపారు.భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం అవసరం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి “భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, బద్దుల సుధాకర్, రొండి నర్సింహా, టంగుటూరు రాములు, దాసరి మనోహర్, దాసరి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

Article Image

చౌటుప్పల్‌లో ఘనంగా 95వ వర్ధంతి – ఏఐవైఎఫ్ నేతల నివాళులు

భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన త్యాగస్ఫూర్తిని చాటిన విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడని కొనియాడారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం భగత్ సింగ్‌దని తెలిపారు.భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం అవసరం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి “భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, బద్దుల సుధాకర్, రొండి నర్సింహా, టంగుటూరు రాములు, దాసరి మనోహర్, దాసరి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News