Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం
March 23, 2026 07:49 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ఘనంగా 95వ వర్ధంతి – ఏఐవైఎఫ్ నేతల నివాళులు

భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన త్యాగస్ఫూర్తిని చాటిన విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడని కొనియాడారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం భగత్ సింగ్‌దని తెలిపారు.భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం అవసరం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి “భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, బద్దుల సుధాకర్, రొండి నర్సింహా, టంగుటూరు రాములు, దాసరి మనోహర్, దాసరి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News