భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్
భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్
K.RAVI
బహుమతుల ప్రధానోత్సవం – యువతకు మార్గదర్శక సందేశాలు
విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవం చౌటుప్పల్ ప్రాంతంలో ఘనంగా జరిగింది.గత వారం రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్లో దాదాపు 13 గ్రామాల జట్లు పాల్గొన్నాయి. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు బత్తుల జయమ్మ దాసు, అలె చిరంజీవి హాజరై వారు మాట్లాడుతూ, భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.విజేతలకు బహుమతులు మొదటి విజేతగా రంగారెడ్డి మల్కాపురం జట్టు నిలవగా, రెండో విజేతగా శ్రీకాంత్ తంగడపల్లి జట్టు నిలిచింది.ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ నాయకులు బండారి నరసింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బోయ లింగస్వామి, టోర్నమెంట్ నిర్వాహకులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, నక్క లింగస్వామి, లగోని లింగస్వామి, రొట్ట అనిల్ కుమార్, రాజ్ పెరియర్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి