Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్
23-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బహుమతుల ప్రధానోత్సవం – యువతకు మార్గదర్శక సందేశాలు

విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవం చౌటుప్పల్ ప్రాంతంలో ఘనంగా జరిగింది.గత వారం రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో దాదాపు 13 గ్రామాల జట్లు పాల్గొన్నాయి. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు బత్తుల జయమ్మ దాసు, అలె చిరంజీవి హాజరై వారు మాట్లాడుతూ, భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు, ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.విజేతలకు బహుమతులు మొదటి విజేతగా రంగారెడ్డి మల్కాపురం జట్టు నిలవగా, రెండో విజేతగా శ్రీకాంత్ తంగడపల్లి జట్టు నిలిచింది.ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ నాయకులు బండారి నరసింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బోయ లింగస్వామి, టోర్నమెంట్ నిర్వాహకులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, నక్క లింగస్వామి, లగోని లింగస్వామి, రొట్ట అనిల్ కుమార్, రాజ్ పెరియర్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్

Article Image

బహుమతుల ప్రధానోత్సవం – యువతకు మార్గదర్శక సందేశాలు

విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవం చౌటుప్పల్ ప్రాంతంలో ఘనంగా జరిగింది.గత వారం రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో దాదాపు 13 గ్రామాల జట్లు పాల్గొన్నాయి. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు బత్తుల జయమ్మ దాసు, అలె చిరంజీవి హాజరై వారు మాట్లాడుతూ, భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు, ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.విజేతలకు బహుమతులు మొదటి విజేతగా రంగారెడ్డి మల్కాపురం జట్టు నిలవగా, రెండో విజేతగా శ్రీకాంత్ తంగడపల్లి జట్టు నిలిచింది.ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ నాయకులు బండారి నరసింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బోయ లింగస్వామి, టోర్నమెంట్ నిర్వాహకులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, నక్క లింగస్వామి, లగోని లింగస్వామి, రొట్ట అనిల్ కుమార్, రాజ్ పెరియర్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News