PRINT TIME: April 10, 2026 09:11 AM
భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
January 06, 2026 02:32 PM
39 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి