Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:38 PM

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
January 06, 2026 02:32 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News