బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
Sthanikam District Staff Reporter
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని,మురిపిరాల గ్రామానికి చెందిన శ్రీను కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ,ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇట్టి విషయంపై స్పందించారు.ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రేరణతో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనుకు డయాలిసిస్ చికిత్స కోసం రూ.50,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం వల్ల బాధిత కుటుంబానికి కొంత ఉపశమనం కలుగుతుందని,అలాగే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపి శ్రీనుకు మరో అదనంగా రూ.1,00,000/- ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.బీర్ల అయిలయ్య మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఇలాంటి సహాయాలు అందించడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి