బెల్ట్ షాపుల మూసివేతకు లింగరాజు పల్లి గ్రామస్తుల తీర్మానం
బెల్ట్ షాపుల మూసివేతకు లింగరాజు పల్లి గ్రామస్తుల తీర్మానం
Vaddeman Suresh
: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు.గ్రామానికి చెందిన నాయకులు ఆదివారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ పాలకవర్గం, మహిళలంతా సమావేశమై అందరి సమక్షంలో ఈ తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల నుండి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ మద్యం విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో లభిస్తుండడంతో స్థానిక యువకులు మద్యానికి బానిసలవుతున్నట్లు తెలిపారు. పలువురు రోగాలు, ప్రమాదాల భారిన పడుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అందరి ఆకాంక్ష మేరకు బెల్డ్ షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగే లింగస్వామి, మాజీ సర్పంచ్ మైసయ్య, ఉపసర్పంచ్ బంగపట్ల జయ, వార్డు మెంబర్లు,సెక్రెటరీ తండ రేణుక గ్రామ ప్రజలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి