Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి
February 20, 2026 11:30 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

సూర్యాపేట: తెజావత్ బెల్లయ్య నాయక్‌కు పార్లమెంట్ సభ్య స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం ముప్పై ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తున్న బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడం ద్వారా గిరిజన సమాజానికి న్యాయం చేయాలని అన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం రాజీ లేని ఉద్యమాలు నిర్వహించిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తించాలని సూచించారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం నిర్వహించిన పాదయాత్రను గుర్తుచేస్తూ, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని పేర్కొన్నారు. రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ వరకు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్లయ్య నాయక్‌ను గిరిజన సహకార సంస్థ అధ్యక్షునిగా నియమించారని, ఆ పదవిలో తెలంగాణ గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో మగ్త నాయక్, భూక్య వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్, సురేష్ నాయక్, అంగోతు శ్రీకాంత్ నాయక్, భావిక్ నాయక్, హార్దిక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News