Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి
February 20, 2026 11:30 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

సూర్యాపేట: తెజావత్ బెల్లయ్య నాయక్‌కు పార్లమెంట్ సభ్య స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం ముప్పై ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తున్న బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడం ద్వారా గిరిజన సమాజానికి న్యాయం చేయాలని అన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం రాజీ లేని ఉద్యమాలు నిర్వహించిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తించాలని సూచించారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం నిర్వహించిన పాదయాత్రను గుర్తుచేస్తూ, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని పేర్కొన్నారు. రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ వరకు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్లయ్య నాయక్‌ను గిరిజన సహకార సంస్థ అధ్యక్షునిగా నియమించారని, ఆ పదవిలో తెలంగాణ గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో మగ్త నాయక్, భూక్య వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్, సురేష్ నాయక్, అంగోతు శ్రీకాంత్ నాయక్, భావిక్ నాయక్, హార్దిక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News