బెల్లయ్య నాయక్కు రాజ్యసభ స్థానం కల్పించాలి
బెల్లయ్య నాయక్కు రాజ్యసభ స్థానం కల్పించాలి
Biksham
లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్
సూర్యాపేట: తెజావత్ బెల్లయ్య నాయక్కు పార్లమెంట్ సభ్య స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం ముప్పై ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తున్న బెల్లయ్య నాయక్కు రాజ్యసభ స్థానం ఇవ్వడం ద్వారా గిరిజన సమాజానికి న్యాయం చేయాలని అన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం రాజీ లేని ఉద్యమాలు నిర్వహించిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తించాలని సూచించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం నిర్వహించిన పాదయాత్రను గుర్తుచేస్తూ, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని పేర్కొన్నారు. రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ వరకు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్లయ్య నాయక్ను గిరిజన సహకార సంస్థ అధ్యక్షునిగా నియమించారని, ఆ పదవిలో తెలంగాణ గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో మగ్త నాయక్, భూక్య వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్, సురేష్ నాయక్, అంగోతు శ్రీకాంత్ నాయక్, భావిక్ నాయక్, హార్దిక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి