Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్
June 02, 2026 05:32 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, మాయ దశరథ్, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యామసుందర్‌రెడ్డి, పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్, కాదురి అచ్చయ్య, జిల్లా కార్యదర్శులు తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యుడు చాంద్‌పాషా, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News