Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:27 AM

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర
20-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో తగ్గించిన రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాగితాలకే

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే

- మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,కార్యనిర్వాహక అధ్యక్షులు గొట్టిపాముల బాబు రావు మాట్లాడుతూ...రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించి,బీసీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీల రిజర్వేషన్లను తగ్గించి మరోసారి బీసీ వర్గాలను మోసం చేయడం దారుణమని అన్నారు.బీసీలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ,వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని,ఇది బీసీ సమాజం ఎన్నటికీ అంగీకరించదని హెచ్చరించారు.ఇప్పటికైనా ఎన్నికలకు సమయం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో

రాష్ట్ర కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ ముదిరాజ్,

ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మాటూరి అశోక్,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,మండల అధ్యక్షులు చిన్న మల్లేష్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,రజక సంఘం జిల్లా నాయకులు సిరికొండ శివకుమార్,మాజీ కౌన్సిలర్ తాడూరు బిక్షపతి ప్రజాపతి,కొండ శ్రవణ్ కుమార్ తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

Article Image

మున్సిపల్ ఎన్నికల్లో తగ్గించిన రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాగితాలకే

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే

- మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,కార్యనిర్వాహక అధ్యక్షులు గొట్టిపాముల బాబు రావు మాట్లాడుతూ...రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించి,బీసీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీల రిజర్వేషన్లను తగ్గించి మరోసారి బీసీ వర్గాలను మోసం చేయడం దారుణమని అన్నారు.బీసీలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ,వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని,ఇది బీసీ సమాజం ఎన్నటికీ అంగీకరించదని హెచ్చరించారు.ఇప్పటికైనా ఎన్నికలకు సమయం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో

రాష్ట్ర కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ ముదిరాజ్,

ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మాటూరి అశోక్,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,మండల అధ్యక్షులు చిన్న మల్లేష్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,రజక సంఘం జిల్లా నాయకులు సిరికొండ శివకుమార్,మాజీ కౌన్సిలర్ తాడూరు బిక్షపతి ప్రజాపతి,కొండ శ్రవణ్ కుమార్ తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News