బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా
బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా
Biksham
రాజ్యాధికార పార్టీ ముందడుగు
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బీ ఫారమ్ల అందజేత
బీసీల రాజకీయ రాజ్యాధికారమే లక్ష్యంగా రెండు నర కోట్ల ప్రజల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులకు బీ ఫారమ్లను అందజేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ అభ్యర్థులకు బీ ఫారమ్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ వార్డుల్లో గట్టిగా ప్రచారం నిర్వహించి పార్టీ గుర్తును ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయం నుంచి సూర్యాపేట పురపాలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బీ ఫారమ్లను అధికారికంగా సమర్పించారు.
ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ హక్కుల కోసం ఏర్పడిన ప్రజల పార్టీ అని తెలిపారు. సమాన న్యాయం, పేద ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు అగ్రకులాల పార్టీల వద్ద బీ ఫారమ్ల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు ఎదురుచూపులు, అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా రాజకీయ న్యాయం జరగలేదని విమర్శించారు. ఈసారి ప్రజల స్వంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇచ్చి రాజకీయ మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి