Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా
February 03, 2026 05:12 AM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాజ్యాధికార పార్టీ ముందడుగు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బీ ఫారమ్‌ల అందజేత

బీసీల రాజకీయ రాజ్యాధికారమే లక్ష్యంగా రెండు నర కోట్ల ప్రజల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులకు బీ ఫారమ్‌లను అందజేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ అభ్యర్థులకు బీ ఫారమ్‌లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ వార్డుల్లో గట్టిగా ప్రచారం నిర్వహించి పార్టీ గుర్తును ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయం నుంచి సూర్యాపేట పురపాలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బీ ఫారమ్‌లను అధికారికంగా సమర్పించారు.

ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ హక్కుల కోసం ఏర్పడిన ప్రజల పార్టీ అని తెలిపారు. సమాన న్యాయం, పేద ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు అగ్రకులాల పార్టీల వద్ద బీ ఫారమ్‌ల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు ఎదురుచూపులు, అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా రాజకీయ న్యాయం జరగలేదని విమర్శించారు. ఈసారి ప్రజల స్వంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇచ్చి రాజకీయ మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News