Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:49 PM

బీఎస్పీ పార్టీ బలోపేతానికి స్థానిక నేతల సక్రియ ప్రయత్నాలు

బీఎస్పీ పార్టీ బలోపేతానికి స్థానిక నేతల సక్రియ ప్రయత్నాలు

బీఎస్పీ పార్టీ బలోపేతానికి స్థానిక నేతల సక్రియ ప్రయత్నాలు
January 21, 2026 06:15 PM 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పీపాడ్‌పల్లి మోహన్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అధికారికంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి నిజమైన అభివృద్ధి బీఎస్పీ ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టంగా తెలిపారు. ప్రజల సమస్యలపై నిస్సహాయంగా కాకుండా పోరాడే పార్టీ బీఎస్పీ మాత్రమేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించే పార్టీగా బీఎస్పీ నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న, నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనుముల తుకారాం, ఉపాధ్యక్షులు సాయిలు, సెక్రటరీ ర్యాలమడుగు సాయిలు, నరేష్, ఏసు తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇతర నాయకులు మాట్లాడుతూ, బీఎస్పీని మరింత బలోపేతం చేయడానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News