Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:24 PM

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్

బీమ్రా గ్రామంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ మచ్చేందర్
January 30, 2026 08:40 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

కంగ్టి మండలం బీమ్రా గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమానికి జి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన జ్ఞానేశ్వర్ మహారాజ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.హరినామ సంకీర్తనల్లో పాల్గొని భక్తులతో కలిసి భజనలు చేయడం ద్వారా కార్యక్రమానికి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచారు. గ్రామాల్లో ఇలాంటి భక్తి కార్యక్రమాలు జరగడం ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.అనంతరం గ్రామ పెద్దలు మచ్చేందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నడిమిదొడ్డి బాబు సర్పంచ్,మాజీ సర్పంచ్ బసవరాజు పటేల్, బాన్సువాడ సర్పంచ్ మాణిక్ రెడ్డి, నాగూర్-కె సర్పంచ్ చందు,దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, చౌకన్పల్లి మాజీ సర్పంచ్ రఘునాథ్, నాగూర్-కె మాజీ సర్పంచ్ ఈరప్ప,రాములు నాయక్ పాల్గొన్నారు.అలాగే బోరంచ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సంగారెడ్డి, అంజి రెడ్డి పటేల్,నర్సప్ప, అనిల్ కుమార్,రామ్తీర్థ్ రవి, విలాస్ రావు పటేల్, గాజుల్పాడ్ సంతోష్,లింగం, నర్సింలు,అశోక్,బాన్సిలాల్, చంద్రకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సప్తహ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News