బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్
బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్
Krishna
జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ దేశాభివృద్ధి, రాష్ట్ర పురోగతి లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఈరోజు అధికారికంగా బీజేపీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం విశేషం. న్యాయవాదిగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన సోమశేఖర్ చేరికతో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.బీజేపీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని ఈ సందర్భంగా సోమశేఖర్ తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి