Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్
January 30, 2026 08:15 PM 332 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ దేశాభివృద్ధి, రాష్ట్ర పురోగతి లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఈరోజు అధికారికంగా బీజేపీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం విశేషం. న్యాయవాదిగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన సోమశేఖర్ చేరికతో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.బీజేపీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని ఈ సందర్భంగా సోమశేఖర్ తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News