Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
January 26, 2026 02:04 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి భారత్ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో దేశభక్తి భావం ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు హాజరై వివిధ వార్డుల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

???? వార్డుల వారీగా నిర్వహించిన వేడుకలు:

15వ వార్డు: జోగం శ్రీను ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

31వ వార్డు: మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.

17వ వార్డు (చింతలచెరువు, అంబేద్కర్ నగర్): పట్టణ నాయకులు కుంచం సురేష్, అయితగాని జనార్ధన్, కంచి లింగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

19వ వార్డు: జిల్లా నాయకుడు ఆకారపు పరిపూర్ణ చారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

9వ వార్డు: ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుండగాని జానీ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనుములపూరి రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

44వ వార్డు: పట్టణ నాయకుడు బూర లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంకినేని వరుణ్ రావు మాట్లాడుతూ, మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా భారతమని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News