Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:53 AM

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

బీజేపీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
January 26, 2026 02:04 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి భారత్ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో దేశభక్తి భావం ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు హాజరై వివిధ వార్డుల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

???? వార్డుల వారీగా నిర్వహించిన వేడుకలు:

15వ వార్డు: జోగం శ్రీను ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

31వ వార్డు: మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.

17వ వార్డు (చింతలచెరువు, అంబేద్కర్ నగర్): పట్టణ నాయకులు కుంచం సురేష్, అయితగాని జనార్ధన్, కంచి లింగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

19వ వార్డు: జిల్లా నాయకుడు ఆకారపు పరిపూర్ణ చారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

9వ వార్డు: ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుండగాని జానీ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనుములపూరి రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

44వ వార్డు: పట్టణ నాయకుడు బూర లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంకినేని వరుణ్ రావు మాట్లాడుతూ, మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా భారతమని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News