Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు, కార్యకర్తల చేరిక

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు, కార్యకర్తల చేరిక

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు, కార్యకర్తల చేరిక
February 10, 2026 03:26 AM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ శేట్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పట్టణంలోని 8వ వార్డు నెహ్రు నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శెనిగరం అంబదాస్‌తో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలతో నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ బలం గణనీయంగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజల పట్ల చూపుతున్న నిబద్ధత నచ్చే పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కలిసి కట్టుగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజల్లో పెరుగుతున్న మద్దతే ఇందుకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగడం మున్సిపల్ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కే శ్రీనివాస్, ఖేడ్ మండల్ అధ్యక్షుడు తాహిర్ అలీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జరిగిన చేరికలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ఖేడ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News