Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:52 PM

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
February 01, 2026 08:33 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. సూర్యాపేట మాజీ జడ్పిటిసి, మాజీ సర్పంచ్ బోడ రాములు కుమారుడు, ఇరవై ఎనిమిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి బోడ రామ్ హేమంత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనతో పాటు తప్పెట్ల తిరుపతిరావు కూడా పార్టీలో చేరారు.అలాగే నలభై ఒకటవ వార్డుకు చెందిన గావాన్ పాషా బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు చేరడం శుభపరిణామమని వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, నాయకులు అనపర్తి రాజేష్, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News