Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
February 01, 2026 08:33 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. సూర్యాపేట మాజీ జడ్పిటిసి, మాజీ సర్పంచ్ బోడ రాములు కుమారుడు, ఇరవై ఎనిమిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి బోడ రామ్ హేమంత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనతో పాటు తప్పెట్ల తిరుపతిరావు కూడా పార్టీలో చేరారు.అలాగే నలభై ఒకటవ వార్డుకు చెందిన గావాన్ పాషా బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు చేరడం శుభపరిణామమని వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, నాయకులు అనపర్తి రాజేష్, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News