Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:49 PM

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
February 01, 2026 08:33 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. సూర్యాపేట మాజీ జడ్పిటిసి, మాజీ సర్పంచ్ బోడ రాములు కుమారుడు, ఇరవై ఎనిమిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి బోడ రామ్ హేమంత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనతో పాటు తప్పెట్ల తిరుపతిరావు కూడా పార్టీలో చేరారు.అలాగే నలభై ఒకటవ వార్డుకు చెందిన గావాన్ పాషా బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు చేరడం శుభపరిణామమని వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, నాయకులు అనపర్తి రాజేష్, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News