Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:07 PM

బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి

బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి

బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి
May 13, 2026 06:12 AM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ / బీదర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జహీరాబాద్–బీదర్ రహదారిపై శంషల్లాపూర్ సమీపంలో ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ దారుణ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో తెలంగాణలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకులు నర్సింహులు (48), అరుణ్ (20) అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు న్యాల్కల్ మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న దాదాపు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమై అద్దాలు చెల్లాచెదురయ్యాయి.ఘటనతో బీదర్–జహీరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ దుర్ఘటన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News