Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

బీబీనగర్ ఎయిమ్స్‌లో 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశం

బీబీనగర్ ఎయిమ్స్‌లో 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశం

బీబీనగర్ ఎయిమ్స్‌లో 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశం
February 20, 2026 08:02 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- పరిపాలన బలోపేతానికి కీలక నిర్ణయాలు: ఎంపీ చామల

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్:All India Institute of Medical Sciences Bibinagar (ఎయిమ్స్), బీబీనగర్‌లో జరిగిన 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో ఎయిమ్స్ బోర్డు సభ్యులు,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్‌స్టిట్యూట్ బాడీ అధ్యక్షులు చంద్రశేఖర్ మహాదేర మేశ్రం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ,స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ,స్టాండింగ్ అకడమిక్ కమిటీ,స్టాండింగ్ సెలెక్షన్ కమిటీ,స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ మరియు హ్యూమన్ రిసోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్,సభ్యులు త్రితంకర్ దేబ్, Postgraduate Institute of Medical Education and Research ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి సంజయ్ జైన్,అలాగే KEM Hospital & Research Centre డైరెక్టర్ C.S.యజనిక్ పాల్గొన్నారు.ఈ కమిటీల ఏర్పాటు ద్వారా సంస్థ పరిపాలన మరింత బలోపేతం కావడం,ఆర్థిక పారదర్శకత పెరగడం,విద్యా ప్రమాణాలు మెరుగుపడడం, నియామక ప్రక్రియ సక్రమీకరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ చామల తెలిపారు.తెలంగాణలో అత్యున్నత వైద్య సేవలు,వైద్య విద్య మరియు పరిశోధన రంగాలలో ఎయిమ్స్ బీబీనగర్ మరింత పురోగమించేందుకు ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News