బీబీనగర్ ఎయిమ్స్లో 6వ ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశం
బీబీనగర్ ఎయిమ్స్లో 6వ ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశం
Sthanikam District Staff Reporter
- పరిపాలన బలోపేతానికి కీలక నిర్ణయాలు: ఎంపీ చామల
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్:All India Institute of Medical Sciences Bibinagar (ఎయిమ్స్), బీబీనగర్లో జరిగిన 6వ ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో ఎయిమ్స్ బోర్డు సభ్యులు,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ బాడీ అధ్యక్షులు చంద్రశేఖర్ మహాదేర మేశ్రం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ,స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ,స్టాండింగ్ అకడమిక్ కమిటీ,స్టాండింగ్ సెలెక్షన్ కమిటీ,స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ మరియు హ్యూమన్ రిసోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్,సభ్యులు త్రితంకర్ దేబ్, Postgraduate Institute of Medical Education and Research ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి సంజయ్ జైన్,అలాగే KEM Hospital & Research Centre డైరెక్టర్ C.S.యజనిక్ పాల్గొన్నారు.ఈ కమిటీల ఏర్పాటు ద్వారా సంస్థ పరిపాలన మరింత బలోపేతం కావడం,ఆర్థిక పారదర్శకత పెరగడం,విద్యా ప్రమాణాలు మెరుగుపడడం, నియామక ప్రక్రియ సక్రమీకరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ చామల తెలిపారు.తెలంగాణలో అత్యున్నత వైద్య సేవలు,వైద్య విద్య మరియు పరిశోధన రంగాలలో ఎయిమ్స్ బీబీనగర్ మరింత పురోగమించేందుకు ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి