బీఆర్ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం
బీఆర్ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం
Editor Desk
నల్లగొండ: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సభ రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను మోసం చేసి తమ ఖజానాలు నింపుకున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ పేరుతో రైతులను ముంచేశారని, ఆ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ప్రజలు మరిచిపోలేదన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో ఉందన్నారు.
“వరి వేస్తే ఉరి” అంటూ రైతులను భయపెట్టిందీ కేసీఆరేనని, రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తూ రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన.. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్కు భవిష్యత్తులో స్థానం ఉండదన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాల రవీందర్రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి