Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

బీఆర్‌ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం

బీఆర్‌ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం

బీఆర్‌ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం
May 19, 2026 07:41 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సభ రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత విమర్శించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులను మోసం చేసి తమ ఖజానాలు నింపుకున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ పేరుతో రైతులను ముంచేశారని, ఆ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ప్రజలు మరిచిపోలేదన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో ఉందన్నారు.

“వరి వేస్తే ఉరి” అంటూ రైతులను భయపెట్టిందీ కేసీఆరేనని, రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు.

ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తూ రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన.. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో స్థానం ఉండదన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాల రవీందర్‌రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News