బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల
బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల
Bandi Kiran Kumar
తుంగతుర్తి పంటలకు జీవం పోసిన నీరు
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి స్థానికం ప్రతినిధి కిరణ్
ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులకు శుభవార్త. పంటలకు జీవం పోసినట్లు బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు సాగునీటిని బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామేలు గారు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. నీరు చివరి ఎకరం వరకు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గంలోని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
పంటలకు తగినంత నీరు అందడంతో దిగుబడులపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి