Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:50 PM

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల
January 08, 2026 05:02 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి పంటలకు జీవం పోసిన నీరు

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి స్థానికం ప్రతినిధి కిరణ్

ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులకు శుభవార్త. పంటలకు జీవం పోసినట్లు బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు సాగునీటిని బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామేలు గారు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. నీరు చివరి ఎకరం వరకు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గంలోని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

పంటలకు తగినంత నీరు అందడంతో దిగుబడులపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News