తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు అందడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి