PRINT TIME: May 26, 2026 03:51 PM
బావిలో మహిళ మృతి – అనుమానాస్పద ఘటన
బావిలో మహిళ మృతి – అనుమానాస్పద ఘటన
April 06, 2026 07:29 PM
139 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ఈడిగ ఆనందమ్మ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆనందమ్మ, అనంతరం పాపిరెడ్డిపల్లి పరిసరాల్లోని వ్యవసాయ బావిలో మృతదేహంగా గుర్తించబడింది. ప్రాథమికంగా అనారోగ్యం మరియు మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి